హిందూపురంలో.. కరోనాపై 85ఏళ్ల బామ్మ విజయం

Published : Apr 24, 2020, 08:55 AM IST
హిందూపురంలో.. కరోనాపై 85ఏళ్ల బామ్మ విజయం

సారాంశం

ఈ వైరస్ సోకిందని తెలియగానే తొలుత ఆమె చికిత్స చేయించుకోవడానికి నిరాకరించారు. తర్వాత వైద్యులు ఆమెకు నచ్చచెప్పడంతో వైద్యానికి సహకరించారు. 16 రోజుల చికిత్స తర్వాత ఆమె కోలుకున్నారు.

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లో విలయతాండవం చేస్తోంది. చూస్తుండగానే రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఈ సంఘటన అందరికీ ఆనందం కలిగించింది. అనంతరం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన ఓ 85ఏళ్ల బామ్మ కరోనాతో పోరాడి విజయం సాధించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హిందూపురం నియోజకవర్గానికి చెందిన ఓ 60ఏళ్ల వృద్ధుడికి ఇటీవల కరోనా సోకింది. అతని నుంచి తల్లికి, కొడుకుకి కూడా వైరస్ సోకింది. తొలుత వైరస్ సోకిన వ్యక్తి చనిపోగా.. అతని తల్లి 85ఏళ్ల వృద్ధురాలు కోలుకోవడం గమనార్హం.

ఈ వైరస్ సోకిందని తెలియగానే తొలుత ఆమె చికిత్స చేయించుకోవడానికి నిరాకరించారు. తర్వాత వైద్యులు ఆమెకు నచ్చచెప్పడంతో వైద్యానికి సహకరించారు. 16 రోజుల చికిత్స తర్వాత ఆమె కోలుకున్నారు.

కాగా.. ఈ వైరస్ తన కొడుకు నుంచి.. తనకు, తన మనవడికి సోకిందని ఆమె చెప్పారు. వైరస్ కారణంగా తన కొడుకు ప్రాణాలు కోల్పోగా.. తాను, తన మనవడు మాత్రం కోలుకున్నామని ఆమె చెప్పారు. మంగళవారం ఆ బామ్మని వైద్య సిబ్బంది డిశ్చార్జ్ చేశారు.

ఆ బామ్మ, మనవడితోపాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు కూడా కరోనా నుంచి కోలుకొని మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. వీరంతా హిందూపురానికి చెందినవారే కావడం గమనార్హం. వీరుకోలుకోగా.. తాజాగా  జిల్లాలో మరో మూడు కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

ఏనుగుల బెడదకు చెక్! పవన్ కీలక నిర్ణయం | Pawan Kalyan Launches Guchchimi Elephant Camp
రామకుప్పంలో విద్యార్థులకు నారా భువనేశ్వరి సికిల్ పంపిణీ | Nara Bhuvaneswari Visits Ramakuppam