
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పెట్రోల్ కొరతపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.