నారాయణ స్కూల్ పై జగన్ ప్రభుత్వం కొరడా

Published : Jun 12, 2019, 11:53 AM IST
నారాయణ స్కూల్ పై జగన్ ప్రభుత్వం కొరడా

సారాంశం

వేసవి సెలవులు ముగించుకుని బుధవారం స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ స్థితిలో విద్యాశాఖ గుర్తింపు లేని పాఠశాల ఏరివేతకు చర్యలు చేపట్టింది.

విజయవాడ: గుర్తింపులేని పాఠశాలలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. గుర్తింపు లేని పాఠశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపిస్తోంది. విజయవాడ, సత్యనారాయణపురంలో గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. 

ఈ విషయమై యాజమాన్యానికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా వైఖరి మారకపోవడంతో సీజ్‌ చేసి, లక్ష రూపాయల జరిమానా విధించారు. వేసవి సెలవులు ముగించుకుని బుధవారం స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ స్థితిలో విద్యాశాఖ గుర్తింపు లేని పాఠశాల ఏరివేతకు చర్యలు చేపట్టింది.

ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిషన్‌ వేయడంతో పాటు అర్హులైన పేదలందరినీ అమ్మ ఒడి ద్వారా ఆదుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే విద్యాశాఖలో సంస్కరణలు తేవడానికి రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

PREV
click me!

Recommended Stories

AP Investments: ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌తకు పండ‌గ‌లాంటి వార్త‌.. తైవాన్ కంపెనీలు భారీగా పెట్టుబ‌డులు
3వ రోజు కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి స్పీచ్ | Nara Bhuvaneswari Visits Horticulture Hub in Kuppam