
మంగళగిరిలోని మయూరీ టెక్ పార్క్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు (APEDB) కార్యాలయాన్ని మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంలో, పరిశ్రమల అభివృద్ధికి ఈ కార్యాలయం కీలక పాత్ర పోషించనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.