కర్నూలులో టీడీపీ నేత హత్య: అమానుషమన్న మంత్రి లోకేష్

Published : May 22, 2019, 03:07 PM IST
కర్నూలులో టీడీపీ నేత హత్య: అమానుషమన్న మంత్రి లోకేష్

సారాంశం

శేఖర్ రెడ్డి హత్యపై ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. శేఖర్ రెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించిందంటూ ట్వీట్ చేశారు. ఆధునిక సమాజంలో ఇలాంటి ఆటవికచర్య అమానుషమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు. శేఖర్ రెడ్డి కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. 

కర్నూలు: ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. టీడీపీ కీలక నేత శేఖర్ రెడ్డి దారుణ హత్యకు గురవ్వడం కర్నూలు జిల్లాలో ఆందోళన నెలకొంది. 

శేఖర్ రెడ్డి హత్యపై ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. శేఖర్ రెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించిందంటూ ట్వీట్ చేశారు. ఆధునిక సమాజంలో ఇలాంటి ఆటవికచర్య అమానుషమన్నారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను కోరారు. శేఖర్ రెడ్డి కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు నారా లోకేష్. 

ఇకపోతే శేఖర్ రెడ్డి హత్య రాజకీయ కోణంలో జరగలేదని ఆ జిల్లా ఎస్పీ ఫకీరప్ప స్పష్టం చేశారు. భూ తగాదాలే శేఖర్ రెడ్డి హత్యకు కారణమని మీడియాకు తెలియజేసిన సంగతి తెలిసిందే. 

 

 

PREV
click me!

Recommended Stories

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు | Asianet News Telugu
Pawan Kalyan: కాకినాడలో ‘మన ఊరు - మాట మంతి’ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu