సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారి, లక్షలాది మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్న కొందరు యూట్యూబర్లు.. ఆ క్రేజ్ను అడ్డం పెట్టుకుని ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో చూపిస్తూ రోజుకో వ్యవహారం బయటకు వస్తోంది. తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ‘నందూస్ వరల్డ్’ నిర్వాహకురాలు రమానందన, ఆమె భర్త జాగర్లకూడి మధుకర్ దంపతుల చుట్టూ ముసురుకున్న మోసం ఆరోపణలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. లండన్లో ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరుతో సామాన్యుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి బురిడీ కొట్టించారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ ఇబ్రహీంపట్నం పోలీస్ కేసు ఏంటి? ఆ డెస్టినీ కన్సల్టెన్సీ వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.