
అమరావతిలో నిర్వహించిన సమావేశంలో మహిళ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర స్థాయిలో జగన్ పై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి పట్ల ఇష్టం లేని వారిని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జగన్ ముందుగా తన ఇంటి సమస్యలకు సమాధానం చెప్పాలని, రాజకీయాలు తర్వాత చేయాలని వ్యాఖ్యానించారు.