ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి Nara Lokesh మైలవరం దేవునిచెరువు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హాజరు తదితర అంశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి బోధన విధానాలపై ఆరా తీశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు.