డీఎస్సీపై త్వరలో నిర్ణయం: మంత్రి గంటా

Published : Sep 04, 2018, 08:22 PM ISTUpdated : Sep 09, 2018, 12:42 PM IST
డీఎస్సీపై త్వరలో నిర్ణయం: మంత్రి గంటా

సారాంశం

త్వరలో డీఎస్సీపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అధికారులు, డైరెక్టర్లతో మంత్రి గంటా శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఈనెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయ ఎంపిక పరీక్షపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే ఖాళీలకు సంబంధించి వివరాలు సిద్ధం చేశామని గంటా తెలిపారు. 

విజయవాడ: త్వరలో డీఎస్సీపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అధికారులు, డైరెక్టర్లతో మంత్రి గంటా శ్రీనివాస్ సమావేశమయ్యారు.

ఈనెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయ ఎంపిక పరీక్షపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే ఖాళీలకు సంబంధించి వివరాలు సిద్ధం చేశామని గంటా తెలిపారు. 

మరోవైపు ట్రిపుల్‌ ఐటీలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి గంటా తెలిపారు. ట్రిపుల్ ఐటీలలో పనిచేస్తున్నఒప్పంద అధ్యాపకులు, మెంటార్లు, బోధనేతర సిబ్బంది సమ్మె నోటీసు అంశంపై చర్చిస్తామన్నారు. అలాగే నూజివీడు ట్రిపుల్‌ ఐటీపై వస్తోన్న అనేక విమర్శలపైనా సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu