జగన్ ఏనుగు, పవన్ కుక్క.. మొరగడం కామన్, ఆయనో కామెడీ పీస్ : అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 13, 2023, 2:51 PM IST
Highlights

వైసీపీ నేతలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. రాజకీయాల్లో పవన్ ఒక కామెడీ పీస్ అంటూ ఆయన దుయ్యబట్టారు. 
 

వైసీపీ నేతలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటరిస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ది పక్కా ప్యాకేజ్ రాజకీయమేనని ఆయన అన్నారు. మీరు కలిసి వచ్చినా, సింగిల్‌గా వచ్చినా వీర మరణమేనని చురకలంటించారు. ధైర్యవంతుడిని అంటాడు.. ఒక్కడినే వెళ్లలేనని చెబుతాడని దుయ్యబట్టారు. తెలుగు రాజకీయాల్లో పవన్ కామెడీ పీస్ అని అంబటి సెటైర్లు వేశారు. పవన్ కామెడీని చూసేందుకే జనం వస్తున్నారని.. జగన్ లాంటి ఏనుగు వెళ్తుంటే.. పవన్ లాంటి కుక్కలు మొరుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. 

పవన్ దృష్టిలో గౌరవం అంటే ప్యాకేజీయేనని అంబటి ధ్వజమెత్తారు. తగిన  ప్యాకేజ్ అందితే పొత్తుకు సిద్ధమని పవన్ కల్యాణ్ చెప్పారని రాంబాబు ఆరోపించారు. పవన్ సమర్ధుడనిపిస్తే ప్రజలే ఓట్లు వేస్తారని ఆయన పేర్కొన్నారు. పవన్‌కు కనీసం ఇంగీత జ్ఞానం కూడా లేదని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు వుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పెట్టిందే జనసేన పార్టీ.. పవన్ లాంటి చీడ పురుగులకు ప్రజలు ఓట్లు వేయరని అంబటి జోస్యం చెప్పారు. చంద్రబాబుతో పవన్ ఏం మాట్లాడాదో అందరికీ తెలుసునని.. పవన్ వెళ్తున్న మార్గం మంచిది కాదని యువత గుర్తించాలని ఆయన సూచించారు. 

ALso REad: నారావారి నరాలు, పసుపు రక్తం: పవన్ కళ్యాణ్ పై మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఫైర్

ఇకపోతే... పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కచ్చితంగా ప్యాకేజీ స్టార్ అని  ఏపీ మంత్రి  గుడివాడ అమర్ నాథ్  విమర్శించారు. పీఎస్‌పీకే అంటే  ప్యాకేజీ స్టార్  పవన్ కళ్యాణ్ అని ఘాటూ వ్యాఖ్యలు  చేశారు. శుక్రవారంనాడు విశాఖపట్టణంలో ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మీడియాతో మాట్లాడారు.నిన్న  శ్రీకాకుళంలో  పవన్ కళ్యాణ్  చేసిన విమర్శలకు  ఆయన కౌంటరిచ్చారు. తన కుటుంబం గురించి మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ కు లేదన్నారు.   పవన్ కళ్యాణ్ మాదిరిగా  ప్యాకేజీలకు తాళాలు కొట్టే కుటుంబం తమది కాదని   పవన్ కళ్యాణ్  తెలుసుకోవాలని మంత్రి  అమర్ నాథ్  కోరారు.మా నాన్న మంత్రిగా  పనిచేశారన్నారు. తాను కూడా మంత్రిగా  పనిచేస్తున్నట్టుగా  మంత్రి చెప్పారు.మా తాత, మా నాన్న, తాను కూడా  ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయాన్ని మంత్రి గుడివాడ అమర్ నాథ్  గుర్తు చేశారు. 

తిట్టడానికి సభ పెట్టలేదని చెబుతూనే  సీఎం జగన్ సహా  ,వైసీపీ నేతలను  పవన్ కళ్యాణ్  నిన్నటి సభలో  తిట్టాడని  మంత్రి అమర్ నాథ్  చెప్పారు.చంద్రబాబు నాయుడు పల్లకి మోయడానికి   సభ పెట్టినట్టుగా  ఉందని  మంత్రి విమర్శించారు.నా పేరు  గుర్తు లేదు సరే... నీ భార్య పిల్లలు పేర్లైనా గుర్తుకు ఉన్నాయా అని మంత్రి  అమర్ నాథ్  ప్రశ్నించారు. నీలాంటి వాడి నోటీ నుండి తన పేరు రాకపోవడం  తనకు మంచిదేనని  మంత్రి  చెప్పారు. 

 

click me!