బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం..!

Published : Aug 04, 2021, 10:06 AM ISTUpdated : Aug 04, 2021, 10:09 AM IST
బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం..!

సారాంశం

బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

మైనర్ బాలిక పై ఓ చర్చి పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో.. బాలిక గర్భం దాల్చింది.  ఈ దారుణ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ చర్చి పాస్టర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పాస్టర్‌ కుంచే వెంకటేశ్వరరావు (మార్క్‌)  నల్లజర్ల మండలం అయ్యవరంలో చర్చిని నెలకొల్పి ప్రార్థనలు చేసేవాడు. ఈ క్రమంలో కూలి పనులు చేసుకునే ఓ కుటుంబం ఆయన వద్దకు వచ్చి ప్రార్థనలు చేయించుకునేది. ఈ క్రమంలో వారి కుమార్తె (14)పై కన్నేసిన అతను తరచూ అత్యాచారం చేస్తూ.. ఎవరికైనా చెబితే దేవుడు శపిస్తాడని బెదిరించేవాడు.

దీంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. సోమవారం కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. వైద్యులు బాలిక నాలుగు నెలల గర్భంతో ఉన్నట్టు తేల్చడంతో విషయం వెలుగు చూసింది. ఈ విషయం గ్రామస్థుల దృష్టికి వెళ్లడంతో వారు మార్క్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనంతపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు