
కాకినాడ సిటీ నియోజకవర్గంలోని కాస్మొపొలిటిన్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేష్ మహాసేన మరియు దళిత నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నివాసంలో అనంతబాబును దాచిపెట్టారని ఆరోపిస్తూ, రెండు రోజుల్లో చట్టానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మంగళగిరిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రకటనలతో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత పెరిగింది.