
తిరుమల, చిత్తూరు జిల్లా: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కే. కవిత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు ఆమె తిరుమలకు వచ్చారు. ఆలయంలో దర్శనం అనంతరం భక్తులతో మాట్లాడిన కవిత, తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు