కాకినాడ జిల్లా సామర్లకోటలోని ఘోర ప్రమాదం జరిగింది. వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది సజీవదహనమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.