
ముఖ్యమంత్రి ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభుత్వం ఆయనను సీఎం ఎక్స్అఫిషియో ప్రత్యేక సీఎస్గా నియమించింది. రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, టీటీడీ వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు.