రేపు అమరావతికి పవన్ కళ్యాణ్

Published : Jun 05, 2019, 11:04 AM IST
రేపు అమరావతికి పవన్ కళ్యాణ్

సారాంశం

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురువారం అమరావతికి రానున్నారు. రేపు ఉదయం 9గంటలకు పవన్ గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకోనున్నారు. 

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురువారం అమరావతికి రానున్నారు. రేపు ఉదయం 9గంటలకు పవన్ గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకోనున్నారు. అక్కడి నుంచి పటమటలంకలోని తన నివాసానికి చేరుకుంటున్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి మంగళగిరి జనసేన కార్యాలయంలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నేతలతో పవన్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
 ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని పవన్ పిలుపునిచ్చారు. సమీక్షలో ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల గురించి నేతలతో పవన్ చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం పవన్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఎన్నికల తర్వతా తొలిసారిగా పవన్ ఈ ప్రెస్ మీట్ లో స్పందించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

TDP Net Worth : అమ్మో.. టీడీపీ అకౌంట్లో అన్ని వందల కోట్లా? చంద్రబాబు పార్టీ ఖర్చు, ఆదాయం లెక్కలు ఇవే..
వెన్నుపోటు పరిపాలన: మార్గాన్ని భరత్ | Margani Bharat Fires on Chandrababu | Asianet News Telugu