ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా

Published : Apr 03, 2024, 10:50 AM IST
   ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా

సారాంశం

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో  ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆటో ఎక్కారు.  

కాకినాడ:పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారంనాడు ఆటోలో ప్రయాణించారు.  గత నాలుగు రోజులుగా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఈ క్రమంలోనే మంగళవారంనాడు  కొత్తపల్లి మండలం కొండెవరం వద్ద ఆటోలో ప్రయాణించారు. తనను గెలిపించాలని  పవన్ కళ్యాణ్ కోరారు.   ఈ ప్రాంతంలో రోడ్డు ఎలా ఉందో పరిశీలించారు. రోడ్లు సరిగా లేకపోవడంతో  ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని  డ్రైవర్లను  పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.  2019 ఎన్నికల్లో  భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా  మాత్రం  పిఠాపురం  అసెంబ్లీ స్థానం నుండి  పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి.  ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇంకా రెండు అసెంబ్లీ స్థానాల్లో  అభ్యర్థులను  జనసేన ప్రకటించాల్సి ఉంది. 

 

2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం,బీజేపీ కూటమికి జనసేన మద్దతు ప్రకటించింది. ఈ కూటమి అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?