వేదపండితుల ఆశీర్వచనం.. ప్రారంభమైన జగన్ చివరి రోజు పాదయాత్ర

By sivanagaprasad kodatiFirst Published Jan 9, 2019, 9:15 AM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర చివరి రోజు ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా పెద్ద కొజ్జిరియా నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర చివరి రోజు ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా పెద్ద కొజ్జిరియా నుంచి జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.

ఈ రోజుతో ప్రజా సంకల్పయాత్ర ముగియనుండటంతో జగన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయన బస చేసిన శిబిరం వద్దకు వచ్చారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం వేలాదిమంది కార్యకర్తల మధ్య జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.

click me!