అసెంబ్లీ లాబీల్లో ఎదురుపడిన బాలయ్య, రోజా

Published : Jun 17, 2019, 06:07 PM ISTUpdated : Jun 17, 2019, 06:11 PM IST
అసెంబ్లీ లాబీల్లో ఎదురుపడిన బాలయ్య, రోజా

సారాంశం

ఏపీ అసెంబ్లీ లాబీల్లో  టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎదురుపడ్డారు. బాగున్నారా అంటూ ఇద్దరూ పరస్పరం పలకరించుకొన్నారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ లాబీల్లో  టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎదురుపడ్డారు. బాగున్నారా అంటూ ఇద్దరూ పరస్పరం పలకరించుకొన్నారు.

బాలకృష్ణ సరసన రోజా పలు సినిమాల్లో నటించారు. తొలుత రోజా టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత రోజా కాంగ్రెస్ పార్టీలో అక్కడి నుండి వైసీపీలో చేరారు. గత ఐదేళ్లలో ఏపీ సీఎం చంద్రబాబుపై, టీడీపీ నేతలపై రోజా నిప్పులు చెరిగారు. 

రోజాను  గత టర్మ్‌లో ఏడాదిపాటు సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. మరో వైపు అసెంబ్లీ లాబీల్లో రోజాతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు బారులు తీరారు. ఈ సమయంలోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కొంచెంద ఇబ్బందిపడ్డారు. మార్షల్స్ సాయంతో అచ్చెన్నాయుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu
Republic Day Celebrations in Amaravati: చంద్రబాబుకి పవన్ కి లోకేష్ ఘన స్వాగతం| Asianet News Telugu