తూర్పు గోదావరిలో హైటెన్షన్: ఒక ఉద్యోగం కోసం గ్రామస్తుల మధ్య ఘర్షణ

Siva Kodati |  
Published : Jun 04, 2020, 04:11 PM IST
తూర్పు గోదావరిలో హైటెన్షన్: ఒక ఉద్యోగం కోసం గ్రామస్తుల మధ్య ఘర్షణ

సారాంశం

తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఉద్యోగం కోసం రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఉప్పలగుప్తం మండలం ఎస్. కొత్తపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించి కొత్తవారిని నియమించాలనే చర్చ గ్రామంలో నడుస్తోంది

తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఉద్యోగం కోసం రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఉప్పలగుప్తం మండలం ఎస్. కొత్తపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించి కొత్తవారిని నియమించాలనే చర్చ గ్రామంలో నడుస్తోంది. దీని కోసం గ్రామంలోని రెండు వర్గాలు పోటీ పడ్డాయి.

ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న ఓ కార్యకర్త తన చేయి పట్టుకున్నారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా అది తప్పుడు ఫిర్యాదని తేలింది.

ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు గ్రామస్తులు ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

నారా భువనేశ్వరి ఇంగ్లీష్ స్పీచ్ కి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ షాక్| Asianet News Telugu
Nimmala Rama Naidu Pressmeet: ఉగ్రవాదులకంటే ఉన్మాదం జగన్ పై రెచ్చిపోయిన నిమ్మల | Asianet News Telugu