
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రోజురోజుకు మారుతోంది. ఒకవైపు 45 డిగ్రీల వరకు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కూడా పడే అవకాశముంది.