జగన్ పుట్టినరోజున ‘సచివాలయ దినోత్సవం’.. ఉద్యోగ సంఘం కీలక ప్రకటన..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 14, 2020, 10:24 AM IST
జగన్ పుట్టినరోజున ‘సచివాలయ దినోత్సవం’.. ఉద్యోగ సంఘం కీలక ప్రకటన..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు అరుదైన గౌరవం దక్కింది. సచివాలయ ఉద్యోగులు ఆయనకు ఈ గౌరవాన్ని అందించనున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లో దాదాపు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేసిన కారణంగా ఈ గౌరవం లభించనుంది.

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు అరుదైన గౌరవం దక్కింది. సచివాలయ ఉద్యోగులు ఆయనకు ఈ గౌరవాన్ని అందించనున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లో దాదాపు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేసిన కారణంగా ఈ గౌరవం లభించనుంది.

డిసెంబర్ 21న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజున రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవాన్ని జరపనున్నారు. ఈ మేరకు సచివాలయాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంట్రామిరెడ్డి కీలక ప్రకటన చేశారు. 

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సుమారు 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం అసాధారణ విషయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అందుకే  ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

ఆదివారం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. కాగా, ఏపీ సీఎం జగన్ 2019 అక్టోబర్ 2న రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu