
భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర తదితరులు ఘన స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.