ఘోర ప్రమాదం...కారులో మంటలు..ఐదుగురు సజీవదహనం

Published : Sep 14, 2019, 10:15 AM IST
ఘోర ప్రమాదం...కారులో మంటలు..ఐదుగురు సజీవదహనం

సారాంశం

ఈ ఘటనతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా.... ఒకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు.  

చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగి.. ఐదుగురు సజీవదహనమయ్యారు. తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు గంగవరం మండలం మామడుగు సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ఘటనతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా.... ఒకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు.

గంగవరం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు. మృతులంతా తిరుపతికి చెందిన వారుగా గుర్తించారు. గాయలతో బయటపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్