విజయవాడ అగ్ని ప్రమాద మృతులకు 50 లక్షల పరిహారం: జగన్

By team teluguFirst Published Aug 9, 2020, 9:32 AM IST
Highlights

ఈ అగ్రిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. 

ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్ గా నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలస్ హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి చికిత్స పొందుతున్న రోగులు, సిబ్బంది సహా ఇప్పటివరకు 9  మరణించారు. 

ఈ అగ్రిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. 

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఇదివరకే ఆదేశాలు ఇచ్చారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో కోవిడ్‌ పేషెంట్లను ఉంచగా, అందులో అగ్నిప్రమాదం సంభవించి పలువురు మరణించిన ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

click me!