
విజయవాడ : ఇంగ్లాండ్ అండర్ 19 క్రికెట్ టీం ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఇంగ్లాండ్ అండర్ 19 బృందానికి దగ్గరుండి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆటగాళ్లకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అలాగే అధికారులు అండర్మ్మవారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేసారు.
వీడియో