చెన్నైలో శ్రీ కళాసుధ అసోసియేషన్ నిర్వహించిన ఉగాది పురస్కార అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రముఖులు పాల్గొని కళా, సాహిత్య, సామాజిక రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి డా. చంద్రశేఖర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను అందజేసి విజేతలను అభినందించారు.