ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకగ్రీవం

Published : Jun 25, 2020, 05:14 PM IST
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకగ్రీవం

సారాంశం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ అయిన స్థానానికి వైసీపీ అభ్యర్ధిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ అయిన స్థానానికి వైసీపీ అభ్యర్ధిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

 ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటీఫికేషన్ విడుదలైంది.  నామినేషన్ల దాఖలు చేయడానికి ఇవాళే చివరి తేది. నామినేషన్ల స్క్యూట్నీని ఈ నెల 26న నిర్వహించనున్నారు. ఈ స్థానానికి టీడీపీ  తరపున ఎవరూ కూడ నామినేషన్లు దాఖలు చేయలేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేసినట్టుగా అధికారులు తెలిపారు. రేపు నామినేషన్ల స్కూట్నీని నిర్వహించనున్నారు. 

మరో అభ్యర్ధి బరిలో నిలిచి ఉంటే ఈ ఏడాది జూలై 6వ తేదీన ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చేది. ఈ ఏడాది మార్చి 9వ తేదీన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. ఇదే స్థానానికి ఎన్నిక నిర్వహిస్తున్నారు. 2023 మార్చి 29వ తేదీ వరకు ఈ ఎమ్మెల్సీ పదవి కాలం ఉంటుంది. 
ఇవాళ ఉదయమే మాణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు.

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu