జగన్ ని కలిసిన దాసరి అరుణ్

Published : Mar 14, 2019, 03:14 PM IST
జగన్ ని కలిసిన దాసరి అరుణ్

సారాంశం

దివంగత సినీ దర్శక, నిర్మాత దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ గురువారం వైసీపీ అధినేత జగన్ ని కలిశారు. 

దివంగత సినీ దర్శక, నిర్మాత దాసరి నారాయణ రావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ గురువారం వైసీపీ అధినేత జగన్ ని కలిశారు. అరుణ్.. ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.  కాగా.. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అరుణ్ జగన్ ని కలిశారు.

ఈ సందర్భంగా అరుణ్ మీడియాతో మాట్లాడారు. తనకు వైసీపీ  సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చాయని చెప్పారు. అందుకే తాను ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ప్రచారం చేస్తా...అని తెలిపారు. కాగా ఇప్పటికే ప్రముఖ హాస్యనటుడు అలీ, జయసుధ లాంటి సినీ ప్రముఖులు  వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Bhuvaneswari Interacts with Womenవైసీపీ గ్రామంఅని తెలిసినాపట్టించుకోకుండా వచ్చా| Asianet News Telugu
Nara Bhuvaneswari Super Speech: అందుకే చంద్రబాబు కి కృతజ్ఞత చెప్పాలి | Asianet News Telugu