కాకినాడలో బీటలు వారుతున్న అపార్ట్‌మెంట్: ఖాళీ చేసిన జనం

Siva Kodati |  
Published : Sep 19, 2019, 06:23 PM ISTUpdated : Sep 19, 2019, 06:32 PM IST
కాకినాడలో బీటలు వారుతున్న అపార్ట్‌మెంట్: ఖాళీ చేసిన జనం

సారాంశం

కాకినాడలో అపార్ట్‌మెంట్స్ దెబ్బతింటున్నాయి. నగరంలోని దేవీ మల్టీప్లెక్స్ కు సమీపంలోని భాస్కర్ ఎస్టేట్ అపార్ట్‌మెంట్ వెనుక భాగంలో ఉన్న మూడు పిల్లర్లు బీటలు వారాయి.

కాకినాడలో అపార్ట్‌మెంట్స్ దెబ్బతింటున్నాయి. నగరంలోని దేవీ మల్టీప్లెక్స్ కు సమీపంలోని భాస్కర్ ఎస్టేట్ అపార్ట్‌మెంట్ వెనుక భాగంలో ఉన్న మూడు పిల్లర్లు బీటలు వారాయి.

ఇందులో మొత్తం 40 ఫ్లాట్లు ఉన్నాయి.. భయాందోళనకు గురైన జనం ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి, అపార్ట్‌మెంట్ బీటలు వారేందుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.

ఈ భవనం సుమారు 13 ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి  వుంది.
 

PREV
click me!

Recommended Stories

అంగన్‌వాడీ కేంద్రంలో ఫుడ్ కమీషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ! | AP Food Commission Chairman
కుప్పం మహిళలతో నారా భువనేశ్వరి! ఆత్మీయ కలయిక! | Nara Bhuvaneswari Kuppam Tour