శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన కరోనా: మూడు కూడా మర్కజ్ లింకులే

Published : Apr 25, 2020, 12:20 PM IST
శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన కరోనా: మూడు కూడా మర్కజ్ లింకులే

సారాంశం

కరోనా వైరస్ కు దూరంగా ఉంటూ వచ్చిన శ్రీకాకుళం జిల్లాలో తాజాగా మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం జిల్లాలో అప్రమత్తమైంది. మూడు కేసులు కూడా మర్కజ్ తో లింకులున్నవే.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోకి కరోనా వైరస్ ప్రవేశించింది. ఇప్పటి వరకు జీరో కేసులతో కరోనా వైరస్ కు దూరంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాను కరోనా వైరస్ వణికించడం ప్రారంభించింది. శ్రీకాకుళం జిల్లాలో గత 24 గంటల్లో మూడు కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కేసులు మూడు మాత్రమే. 

ఆ మూడు కేసులు కూడా ఢిల్లీలోని మర్కజ్ కు లింకులున్నవే కావడం విశేషం. ఆ ముగ్గురు కరోనా వైరస్ రోగులతో 67 మంది కాంటాక్టులోకి వచ్చినట్లు గుర్తించారు. వారిలో 29 మందిని క్వారంటైన్ కు తరలించారు. కరోనా వైరస్ కేసుల కారణంగా సీది, కారువాడ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కేసులు బయటపడిన ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా ప్రకటించారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వణుకు పుట్టిస్తోంది. ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేయి దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో తాజాగా 61 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ తో మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 31కి చేరుకుంది. 

రాష్ట్రంలో 171 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 814గా ఉంది. గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి.  ఆ తర్వాత కర్నూలు జిల్లాలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. 

కర్నూలు జిల్లా మొత్తం 275 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు 209కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కు దూరంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో మాత్రం కేసులు నమోదు కాలేదు. చిత్తూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు. కొంత వరకు ఈ మూడు జిల్లాలకు ఊరట లభించినట్లే.

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వల్ల అత్యధికంగా మంది మరణించగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎనిమిదేసి మంది మరణించారు. అఅనంతపుూరం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మరణించారు.

జిల్లాలవారీగా కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

అనంతపురం 51
చిత్తూరు 73
తూర్పు గోదావరి 37
గుంటూరు 209
కడప 55
కృష్ణా 127
కర్నూలు 275
నెల్లూరు 72
ప్రకాశం 53
శ్రీకాకుళం 3
విశాఖపట్నం 22 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu