గుంటూరు: జూనియర్‌తో సీనియర్ విద్యార్ధి గొడవ.. సినీఫక్కిలో వెంటాడి కొట్టుకున్న ఇరువర్గాలు

By Siva KodatiFirst Published Aug 7, 2021, 5:23 PM IST
Highlights

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విద్యార్ధుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. నలందా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద రెండు వర్గాలుగా  విడిపోయిన విద్యార్ధులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కార్లలో వెంబడించి మరి దాడులకు దిగారు.
 

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విద్యార్ధుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. నలందా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద రెండు వర్గాలుగా  విడిపోయిన విద్యార్ధులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కార్లలో వెంబడించి మరి దాడులకు దిగారు. ఈ ఘటనలో 8 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు విద్యార్ధుల మధ్య జరిగిన వివాదమే ఘర్షణకు కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను పరామర్శించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

click me!