వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నిరసన సెగ.. వాహనాన్ని అడ్డుకున్న సీఐటీయూ నేతలు..

Published : Jul 13, 2023, 02:45 PM IST
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నిరసన సెగ.. వాహనాన్ని అడ్డుకున్న సీఐటీయూ నేతలు..

సారాంశం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని సీఐటీయూ నేతలు అడ్డుకున్నారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని సీఐటీయూ నేతలు అడ్డుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారికి పక్కకు తప్పించారు. వివరాలు.. మిథున్ రెడ్డి  నేడు మదనపల్లిలో నిర్వహించే అమ్మఒడి కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. అయితే అప్పటికే స్థానిక ఇండస్ట్రీయల్ ఎస్టేట్ వద్ద సీఐటీయూ నేతలు ధర్నా చేస్తున్నారు. గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ వారు నిరసనకు దిగారు. 

అయితే అదే సమయంలో మదనపల్లి వెళ్తున్న మిథున్ రెడ్డి కాన్వాయ్‌ ఎదుట సీఐటీయూ నేతలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే నిరసనకారులు  రోడ్డుపై బైఠాయించి నిరసన కొనసాగించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అక్కడి  నుంచి లిఫ్ట్ చేశారు. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి  కాన్వాయ్ ముందుకు సాగింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం