
విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. ఆలయంలోని కప్ప స్తంభం వద్ద సంప్రదాయం ప్రకారం సీఎం మొక్కులు చెల్లించారు.