ఏపీకి కేంద్రం శుభవార్త.. రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్లు విడుదల

Siva Kodati |  
Published : Nov 08, 2022, 08:33 PM ISTUpdated : Nov 08, 2022, 08:35 PM IST
ఏపీకి కేంద్రం శుభవార్త.. రెవెన్యూ లోటు కింద రూ.879 కోట్లు విడుదల

సారాంశం

రెవెన్యూ లోటు భర్తీ కింద ఆంధ్రప్రదేశ్‌కు మంగళవారం రూ.879 కోట్లను విడుదల చేసింది కేంద్రం. ఏపీ సహా మొత్తం 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది కేంద్రం.

పీకల్లోతు అప్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి మంగళవారం రూ.879 కోట్లను విడుదల చేసింది. వీటితో కలిపి ఈ ఏడాదికి ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు కింద రూ.7,032 కోట్లను కేంద్రం విడుదల చేసినట్లయ్యింది. ఈ రోజు ఏపీ సహా మొత్తం 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది కేంద్రం. వీటిలో అసోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లు వున్నాయి. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌కు రూ.1,132 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 

PREV
click me!

Recommended Stories

NO విడాకులు.. NO డౌట్స్! | TDP - Janasena Alliance News | Asianet News Telugu
లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu