తిరుపతిలో కారు బీభత్సం, బైకులు ధ్వంసం.. ఇంటికి వెళ్లకుండానే ప్రమాదానికి గురైన కొత్తకారు

By Siva KodatiFirst Published Nov 5, 2021, 5:32 PM IST
Highlights

తిరుపతిలో (tirupati) కారు బీభత్సం సృష్టించింది. స్థానిక ఎస్ కె ఫాస్ట్ పుడ్ (sk fast food) వద్ద కారు అదుపుతప్పి పార్క్ చేసిన బైక్ లపై దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఎనిమిది బైక్ లు ధ్వంసం అయ్యాయి. కారు బీభత్సంతో ఏం జరుగుతుందో తెలియక జనం పరుగులు తీశారు.

తిరుపతిలో (tirupati) కారు బీభత్సం సృష్టించింది. స్థానిక ఎస్ కె ఫాస్ట్ పుడ్ (sk fast food) వద్ద కారు అదుపుతప్పి పార్క్ చేసిన బైక్ లపై దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఎనిమిది బైక్ లు ధ్వంసం అయ్యాయి. కారు బీభత్సంతో ఏం జరుగుతుందో తెలియక జనం పరుగులు తీశారు. కొత్త కారు కొనుగోలు చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఆ వాహనం అదుపుతప్పినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి (road accident) గురైన కారు తిరుపతి అక్కారంపల్లికి చెందిన లక్ష్మీనరసింహదిగా తెలుస్తోంది. ఆ కారును షోరూం నుంచి లీలామహల్‌ వైపున్న తన నివాసానికి తీసుకెళ్తుండగా స్థానిక ఎస్కే ఫాస్ట్‌ఫుడ్స్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారు, ద్విచక్ర వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. 

click me!