బుద్ధా వెంకన్నకు రెండోసారి పాజిటివ్.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి టీడీపీ ఎమ్మెల్సీ

Siva Kodati |  
Published : Sep 17, 2020, 04:54 PM IST
బుద్ధా వెంకన్నకు రెండోసారి పాజిటివ్.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి టీడీపీ ఎమ్మెల్సీ

సారాంశం

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు రెండోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. అంతకు ముందు గత నెలలో వెంకన్న మొదటి సారి కోవిడ్ బారినపడ్డారు.

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు రెండోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. అంతకు ముందు గత నెలలో వెంకన్న మొదటి సారి కోవిడ్ బారినపడ్డారు.

ఆ సమయంలో ఆయన 14 రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని బుద్ధా ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఓ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఇటీవలే వైరస్ నుంచి కోలుకున్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ పరిస్ధితి చేయి దాటిపోయిందని.. ప్రజలు కరోనా బారి నుంచి తప్పించుకునే పరిస్ధితి కనిపించడం లేదన్నారు.

తక్షణం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అన్ని కళ్యాణ మండపాలను కోవిడ్ కేంద్రాలుగా మార్చాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్తును మార్చే ప్రాజెక్ట్‌.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారం మైనింగ్
Pemmasani Speech: రజతోత్సవ కార్యక్రమంలోపెమ్మసాని అదిరిపోయే స్పీచ్ | Cancer Hospital Silver Jubilee