బీజేపీ వెనకాల వైసీపీ.. సభకు రాకుండా గేమ్: బుద్ధా వెంకన్న

By sivanagaprasad KodatiFirst Published Sep 6, 2018, 10:48 AM IST
Highlights

బీజేపీ, వైసీపీలపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ఆటలో బుడంకాయాల్లా మారారని.. బీజేపీ పగటి వేషగాళ్లతో ఒరిగేదేమి లేదని విమర్శించారు

బీజేపీ, వైసీపీలపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ఆటలో బుడంకాయాల్లా మారారని.. బీజేపీ పగటి వేషగాళ్లతో ఒరిగేదేమి లేదని విమర్శించారు. వైసీసీ అసెంబ్లీకి రాకుండా బీజేపీ వెనకుండి ఆటలాడిస్తోందని ఆరోపించారు.. దే

శం ప్రజల జేబులకు ప్రధాని మోడీ చిల్లు బెట్టారని.. ఆయన్ను ఎప్పుడు సాగనంపాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు వేగం, పనితీరుతో మోడీ, జగన్‌లకు ముచ్చెమటలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు.

click me!