కర్నూలులో కలకలం.. వైసీపీ నేత ఇంట్లో పేలిన బాంబు

By telugu news teamFirst Published Feb 26, 2020, 9:38 AM IST
Highlights

బాంబు పేలుడుతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. నాటు బాంబును వైసీపీ నేత తన పాత ఇంటి గోడలో దాడినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. 

కర్నూలు జిల్లాలో నాటు బాంబు కలకలం రేగింది. ఓ వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబు పేలింది. సంజామల మండలం అక్కంపల్లిలోని ఓ వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు.

Also Read భర్త బతికుండగానే ప్రియుడితో పెళ్లి చివరికిలా.....

బాంబు పేలుడుతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. నాటు బాంబును వైసీపీ నేత తన పాత ఇంటి గోడలో దాడినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

click me!