రేపు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ మంత్రుల సమావేశం.. 9 మందికి పిలుపు

Siva Kodati |  
Published : Nov 25, 2022, 03:09 PM IST
రేపు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ మంత్రుల సమావేశం.. 9 మందికి పిలుపు

సారాంశం

శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ మంత్రులు, నేతల సమావేశం జరగనుంది. ఈ భేటీకి 9 మందికి ఆహ్వానాలు అందినట్లుగా తెలుస్తోంది. ఆయా వర్గాలకు ఇచ్చిన పథకాలను వివరించడం వంటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రేపు బీసీ మంత్రులు, నేతల కీలక సమావేశం జరగనుంది. శనివారం ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ భేటీకి మంత్రులు బొత్స సత్యనారాయణ, గుమ్మనూరి జయరాం, జోగి రమేశ్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ముత్యాల నాయుడులతో పాటు ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఈ భేటీకి హాజరుకానున్నారు. 

వచ్చే ఎన్నికల్లో బీసీలను కన్సాలిడేట్ చేసుకోవడం, ఆయా వర్గాలకు ఇచ్చిన పథకాలను వివరించడం వంటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించడం వంటి అంశాలపైనా 9 మంది నేతలు చర్చించే అవకాశం వుంది. భేటీ తర్వాత వీరంతా ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యే అవకాశం వుందని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Rain Alert : రుతుపవనాలు వచ్చేస్తున్నాయి... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !