బ్యాంకాక్ లో మచిలీపట్నం వాసి మృతి

By sivanagaprasad KodatiFirst Published Aug 14, 2018, 12:21 PM IST
Highlights

బ్యాంకాక్ లో స్విమ్మింగ్ పూల్ లో పడి  మచిలీపట్నంకు చెందిన పల్లంపాటి వెంకటేష్ దుర్మరణం చెందారు. 

మచిలీపట్నం: 
బ్యాంకాక్ లో స్విమ్మింగ్ పూల్ లో పడి  మచిలీపట్నంకు చెందిన పల్లంపాటి వెంకటేష్ దుర్మరణం చెందారు. హైదరాబాద్ లో దివాన్ ఫైనాన్స్ కార్పొరేషన్ క్రెడిట్ విభాగంలో మేనేజర్ గా పనిచేస్తున్నపల్లంపాటి వెంకటేష్ లో ఈనెల 8న ఆఫీస్ పనిమీద తోటి ఉద్యోగులతో కలిసి బ్యాంకాక్ వెళ్లారు. అయితే స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్న వెంకటేష్ అత్యంత ఎత్తు నుంచి స్విమ్మింగ్ ఫూల్ లో దూకారు. 

తలకు బలమైన గాయం కావడంతో  స్విమ్మింగ్ పూల్ లోనే మృతి చెందినట్లు తోటి ఉద్యోగులు చెప్తున్నారు. రెండు రోజుల క్రితం మృతి చెందిన వెంకటేష్ మృతదేహాన్ని బ్యాంకాక్ నుంచి మచిలీపట్నంకు తరలించారు. వెంకటేష్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 
 

click me!