హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు.. భైరి నరేష్‌ను పరిగెత్తించి కొట్టిన అయ్యప్ప స్వాములు

By Siva KodatiFirst Published Dec 30, 2022, 3:27 PM IST
Highlights

కర్నూలు జిల్లా కోస్గీలో భైరి నరేశ్‌పై దాడి చేశారు అయ్యప్ప స్వాములు. నడిరోడ్డుపై వెంబడించి కొట్టారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.

కర్నూలు జిల్లా కోస్గీలో భైరి నరేశ్‌పై దాడి చేశారు అయ్యప్ప స్వాములు. రెండు రోజుల క్రితం అయ్యప్ప భక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు భైరి నరేష్. దీంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్పమాల ధారులు ఆందోళన నిర్వహించారు. కోస్గీలో నరేశ్ కనిపించడంతో ఆగ్రహానికి గురయ్యారు భక్తులు. వెంటనే అతనిపై దాడికి దిగారు. నడిరోడ్డుపై వెంబడించి కొట్టారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!