చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి రేటు నెంబర్ వన్ గా ఉండేదని కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి రేటు కేవలం సున్నాలకే పరిమితం అయ్యిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.
విశాఖపట్నం: గాడిదకి గడ్డిపెట్టి గేదెను పాలు అడిగినట్లు అవినీతిపరుడికి ఓటు వేసి రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే ఎట్లా అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి రేటు నెంబర్ వన్ గా ఉండేదని కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి రేటు కేవలం సున్నాలకే పరిమితం అయ్యిందన్నారు. ఈ విషయం నీతి ఆయోగ్ వెబ్ సైట్ లో కాగ్ రిపోర్టును చూస్తే అర్థమవుతుందని మాజీ మంత్రి తెలిపారు.
అయ్యన్న ఇంకా ఏం మాట్లాడారో కింది వీడియోలో చూడండి.