
ఆంధ్రప్రదేశ్లో భానుడి భగభగలు మొదలయ్యాయి. 73 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతోందనీ, జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మరో 2, 3 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.