మండలిలో వైసీపీ సర్కార్‌కు మళ్లీ షాక్: వీగిపోయిన మరో బిల్లు

Siva Kodati |  
Published : Dec 03, 2020, 06:16 PM IST
మండలిలో వైసీపీ సర్కార్‌కు మళ్లీ షాక్: వీగిపోయిన మరో బిల్లు

సారాంశం

ఏపీ శాసన మండలిలో మరోసారి అధికార పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఏపీ వ్యాట్ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 24, అనుకూలంగా 8, తటస్థంగా 4 ఓట్లు పోలయ్యాయి.

ఏపీ శాసన మండలిలో మరోసారి అధికార పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. గురువారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఏపీ వ్యాట్ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 24, అనుకూలంగా 8, తటస్థంగా 4 ఓట్లు పోలయ్యాయి. మండలి నుంచి బీజేపీ వాకౌటయ్యింది.

కాగా, నిన్న వైసీపీ ప్రభుత్వం తరపున మంత్రి బొత్స ప్రవేశపెట్టిన పురపాలక పన్నుల సవరణ చట్టం బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. బిల్లును టీడీపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వ్యతిరేకించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 29 ఓట్లు, అనుకూలంగా 11 మంది ఎమ్మెల్సీలు ఓట్లు వేశారు. ఇద్దరు సభ్యులు తటస్థంగా ఉన్నారు.
 

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu