నిరుద్యోగులకు శుభవార్త...46,290 ఉద్యోగాలపై ఆర్థిక మంత్రి ప్రకటన

Published : Sep 08, 2018, 10:57 AM ISTUpdated : Sep 09, 2018, 01:32 PM IST
నిరుద్యోగులకు శుభవార్త...46,290 ఉద్యోగాలపై ఆర్థిక మంత్రి ప్రకటన

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అసెంబ్లీ సాక్షిగా ఓ శుభవార్త అందింది. అసెంబ్లీ లో ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ...ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు, వాటి భర్తీ ప్రక్రియ గురించి వివరించారు. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీచేస్తామంటూ నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అసెంబ్లీ సాక్షిగా ఓ శుభవార్త అందింది. అసెంబ్లీ లో ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ...ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలు, వాటి భర్తీ ప్రక్రియ గురించి వివరించారు. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీచేస్తామంటూ నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించారు.

 ఏపిలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి దాదాపు 46,290 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయంటూ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే దాదాపు 2,350 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే