AP Intermediate Results 2022 : నేడే ఏపీలో ఇంటర్ రిజల్ట్స్.. మార్కులు ఎలా చూసుకోవాలంటే...

Published : Jun 17, 2022, 08:32 AM IST
AP Intermediate Results 2022 : నేడే ఏపీలో ఇంటర్ రిజల్ట్స్.. మార్కులు ఎలా చూసుకోవాలంటే...

సారాంశం

ఆంధప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత, విద్యార్థులు తమ మార్కులను తనిఖీ చేసుకోవడానికి bie.ap.gov.inని సందర్శించవచ్చు. బీఐఈ ఏపీ పరీక్షలు ఈ ఏడాది మే 6 నుంచి మే 24 వరకు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ : బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (BIE AP) నివేదికల ప్రకారం, ఈ రోజు జూన్ 17న ఆంధ్రప్రదేశ్ లోని ఇంటర్ మొదటి, ఇంటర్ ద్వితీయసంవత్సరాల ఫలితాలను 2022 ప్రకటిస్తోంది. విద్యార్థులకు డిజిటల్ స్కోర్‌కార్డులు ఇస్తామని చెప్పారు. ఫలితాలు వెలువడిన తర్వాత, విద్యార్థులు తమ మార్కులను తనిఖీ చేసుకోవడానికి bie.ap.gov.inని సందర్శించవచ్చు. బీఐఈ ఏపీ పరీక్షలు ఈ ఏడాది మే 6 నుంచి మే 24 వరకు జరిగాయి.

విద్యాధికారుల నివేదికల ప్రకారం, దాదాపు 4.7 లక్షల మంది విద్యార్థులు AP ఇంటర్ పరీక్ష 2022 రాశారు. మనబడి ఇంటర్ ఫలితాల 2022 కోసం ఎదురుచూస్తున్నారు. నివేదికల ప్రకారం, 4,64,756 మంది విద్యార్థులు తమ AP ఇంటర్ ఫలితాల 2022 కోసం వేచి ఉన్నారు.

AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2022 :  మార్కులను ఇలా చూసుకోండి..

- ముందుగా BSEAP అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.inలోకి వెళ్లాలి 

- హోమ్ పేజీలో, AP ఇంటర్ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయాలి

- తరువాత లాగిన్ సమాచారాన్ని నమోదు చేసి, ఎంటర్ బటన్‌పై క్లిక్ చేయాలి

- సమాచారం సరైనదే అయితే.. వెంటనే మీ రిజల్ట్స్ స్క్రీన్‌పై కనబడుతుంది. 

- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని, సేవ్ చేసుకోండి.

AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2022 : ఏడు కీలక అంశాలు

- ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు మే 6 నుండి మే 24, 2022 వరకు జరిగాయి.

- ఈ సారి విద్యార్థులకు డిజిటల్ స్కోర్‌కార్డులు ఇస్తారు.

- డిజిటల్ స్కోర్‌కార్డులు అధికారిక వెబ్‌సైట్ - bie.ap.gov.inలో అందుబాటులో ఉంటాయి.

- AP క్లాస్ 11, క్లాస్ 12 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి, విద్యార్థులు ప్రతి సబ్జెక్టుకు కనీస అర్హత మార్కుల 33 కంటే ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది.

- ఈ ఫలితాల్లో 90% కంటే ఎక్కువ స్కోర్ చేసిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కాలర్‌షిప్‌లకు అర్హులు.

- పరీక్ష అథారిటీ ప్రకారం, సుమారు 4.7 లక్షల మంది విద్యార్థులు AP ఇంటర్ పరీక్ష 2022ల కోసం నమోదు చేసుకున్నారు. మనబడి ఇంటర్ ఫలితాల 2022 కోసం ఎదురుచూస్తున్నారు.

- నివేదికల ప్రకారం, 4,64,756 మంది విద్యార్థులు  ప్రస్తుతం AP ఇంటర్ ఫలితాల 2022 కోసం ఎదురుచూస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu