సినిమా టికెట్ ధరలపై జీవో 35.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

By Siva KodatiFirst Published Sep 4, 2021, 4:34 PM IST
Highlights

సినిమా  టికెట్  రేట్లకు  సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 35పై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీవో 35పై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది
 

సినిమా  టికెట్  రేట్లకు  సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 35పై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీవో 35పై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిర్మాత నట్టికుమార్ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35ను కొందరు  యాజమాన్యాలు అమలు చేయడం లేదని నట్టికుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అధికా రేట్లకు బ్లాక్‌లో టికెట్లు అమ్ముతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆయన కోర్టుకు తెలియజేశారు. 

click me!