చంద్రబాబు కేసు.. ఏఏజీ సుధాకర్ రెడ్డి భద్రత పెంపు.. ఉత్తర్వులు జారీ..

Published : Sep 11, 2023, 02:02 PM IST
చంద్రబాబు కేసు.. ఏఏజీ  సుధాకర్ రెడ్డి భద్రత పెంపు.. ఉత్తర్వులు జారీ..

సారాంశం

 ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డికి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

విజయవాడ: ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డికి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుధాకర్ రెడ్డికి భద్రత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 4+4 గన్‌మెన్లతో ఆయన భద్రత కల్పించనున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఏఏజీ సుధాకర్ రెడ్డి.. స్కిల్‌ డెవల్‌ప్‌మెంట్ కోసులో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సీఐడీ తరఫున వాదనలు వినిపించిన సంగతి  తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  ఆయన భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu
దివ్యాంగులతో టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించిన సీఎం | Divyang Shakti Scheme | Asianet News Telugu