రెండు సార్లు వంగి వంగి: మోడీ కాళ్లు మొక్కబోయిన జగన్, వద్దన్న ప్రధాని

Siva Kodati |  
Published : Jun 10, 2019, 11:02 AM IST
రెండు సార్లు వంగి వంగి: మోడీ కాళ్లు మొక్కబోయిన జగన్, వద్దన్న ప్రధాని

సారాంశం

ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి పాదాభివందనం చేయబోయారు.

ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి పాదాభివందనం చేయబోయారు.

విమానం నుంచి కిందకి దిగి వస్తున్న మోడీకి జగన్ గులాబీతో స్వాగతం పలికారు. ప్రధానిని చూడగానే సీఎం నడుం వంచేశారు. ఒకసారి కాదు రెండు సార్లే జగన్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించగా.. ప్రధాని వాద్దని వారించారు.

అనంతరం ఏదో మాట్లాడి భుజం తట్టారు. అప్పటికీ జగన్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత వరుసగా తన మంత్రివర్గ సహచరులు, ఇతర నేతలను ప్రధానికి పరిచయం చేశారు ముఖ్యమంత్రి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Constable Success Stories:వీళ్ళ ఎమోషనల్ మాటలు చూస్తే కన్నీళ్లు ఆగవు | Police | Asianet News Telugu
Bhumana Karunakar Reddy: దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు కట్టబెడుతున్న బాబు ప్రభుత్వం| Asianet News Telugu